- అధికారులతో కలిసి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..
చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను సోమవారం నాడు సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..తక్కువ నిధులతో ఈ రెండు చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో ఆయనకు వివరించారు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించారు హైడ్రా కమిషనర్. కాగా అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఎస్.టి.ఫై. ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువల్లోకి మల్లిస్తున్న తీరును కూడా పరిశీలించారు..
దీప్తిశ్రీ నగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో ఆయన మాట్లాడారు.. దీప్తి శ్రీ నగర్లో ప్రజ అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు..
దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని హైడ్రా స్థానిక అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు..
రేగుల కుంట, బక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభ్వృద్ది పనులు చేపడతామని ఆయన మీడియాకు వెల్లడించారు.. చెరువుల తో పాటు వివిధ కాలనీల్లో పార్కులకోసం యితర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని హామీ ఇచ్చారు రంగనాథ్..