కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వెలిబుచ్చిన హరీశ్రావు..
ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రి పాలైన వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే మీకు చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్రావు విమర్శించారు. ఏడాదికాలంగా గురుకుల వ్యవస్థ, విద్యావ్యవస్థ కుప్పకూలుతున్న మీరు పట్టించుకోరు, ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని అడ్డుకుంటరు. అరెస్టులు చేస్తారని మండిపడ్డారు. సో కాల్డ్ ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థినులను తాండూ రు ప్రభుత్వ దవాఖానకు తరలించి, వైద్యం అందించారు. తాండూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న సుమారు 180 మంది విద్యార్థినులు ఉన్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు పాఠశాలలో అల్పాహారం కింద కిచిడీ తిన్నారు. 9.30 గంటల ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి అంటూ రోదించడం మొదలుపెట్టారు. వెంటనే వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దవాఖానలో చేరిన ఎనిమిదో తరగతి విద్యార్థినులు గీత, గూలిబాయి, శైలజ, శ్రావణికి వైద్యులు చికిత్స అందించారు. ఫుడ్ పా యిజన్ కారణంగానే వారికి కడుపునొప్పి వచ్చినట్టుగా వైద్యులు వెల్లడించారు.