Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న చిగిరింత దంపతులు..

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న చిగిరింత దంపతులు..

నర్సింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎంని కలిసిన వైనం..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు..
సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దంపతులు..

కొందరు డబ్బుకోసమో, పేరుకోసమో రాజకీయాల్లోకి వస్తారు.. మరికొందరు అధికారం చెలాయించడానికి రాజకీయాల్లోకి వస్తారు.. అతికొద్ది మంది మాత్రమే ప్రజాసేవకోసం, నిస్వార్ధ రాజకీయాలు చేయడానికి వస్తారు.. వీరికి అధికారం, డబ్బు అవసరం లేదు కేవలం సమాజహితాన్ని కోరుకుంటారు.. అలాంటి కోవకే చెందుతారు చిగిరింత నర్సింహారెడ్డి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నిరంతరం ప్రజాసేవలో గడుపుతుంటారు ఈ దంపతులు.. వీరిద్దరిలో నరసింహారెడ్డి పార్టీ కార్యకలాపాలతో బాటు ప్రజల సమస్యలపై ప్రతిస్పందిస్తూ ఉండగా, పారిజాత నర్సింహారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, మేయర్ గా గురుతర బాధ్యతలు నిర్వహిస్తుంటారు.. ప్రజాసేవకు అంకితమైన ఈ దంపతులు నిజంగా అభినందనీయులు..

గురువారం రోజు జూబ్లీహిల్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాదం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగిరింత నర్సింహ రెడ్డి దంపతులు.. అలాగే సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి.. వారిరువురికి శుభాకాంక్షలు తెలిపి, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి, పార్టీకి, ప్రజలకు సేవచేయాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments