Wednesday, June 25, 2025
Google search engine
Homeక్రైమ్ స్పెషల్మూడున్నర కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ..

మూడున్నర కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ..

1130 పోగొట్టుకున్న, దొంగలించబడిన మొబైల్స్ స్వాధీనం..
వివరాలు తెలియజేసిన రాచకొండ పోలీసు అధికారులు..

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ఎంతగా ప్రతి మనిషి జీవితంలో భాగమై పోయిందో తెలుసు.. అందుకనే మొబైల్ ఫోన్స్ దొంగలించేవారు కూడా ఎక్కువైపోయారు.. అలాగే పొరబాటున పోగొట్టుకునే వారు కూడా చాలా మంది వుంటారు.. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ అనేది పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ఫోన్స్ ని ట్రేస్ చెయ్యడంలో ఎంతో ఉపయోగపడుతుంది..

రాచకొండ కమిషనర్ జీ. సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాలతో రాచకొండ స్పెషల్ టీమ్స్ ను సి సి ఎస్ ఎల్.బీ. నగర్, మల్కాజ్గిరి, బోనగిరి ప్రాంతాల్లో పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ఫోన్స్ ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్ సహాయంతో దాదాపు 1130 సెల్ఫోన్స్ ని రికవరీ చేశారు.. వీటి ధర సుమారు రూ. మూడున్నర కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు..

ఇక ఎల్.బీ. నగర్ సీసీఎస్ పరిధిలో 706, మల్కాజ్గిరి పరిధిలో 312, బోనగిరి పరిధిలో 112 చొప్పున మొత్తం 1130 సెల్ఫోన్స్ రికవరీ చేశారు.. కాగా ఈ సంవత్సరంలో రాచకొండ పోలీసులు దాదాపు 3694 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు..

కాగా మంగళవారం అనగా 24 జూన్ 2025 నాడు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొబైల్ ఫోన్స్ అసలైన యజమానులకు అప్పగించడం జరిగింది.. ఈ క్రమంలో వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా కమిషనర్ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని కాపాడుకోవాలని సూచించారు.. తమ మొబైల్స్ రికవరీ చేసి తమకు అప్పగించినందుకు కమిషనర్ కి వారందరూ కృతజ్ఞతలు తెలియజేశారు బాధితులు.. పోలీసుల పనితీరును అభినందించారు..

ఈ సందర్భంగా కమిషనర్ ఈ ఆపరేషన్ లో పాల్గొని సెల్ ఫోన్స్ ని రికవరీ చేసినందుకు డీసీపీ క్రైమ్స్ వీ. అరవింద్ బాబు, ఏసీపీ క్రైమ్స్ కరుణాసాగర్, సీసీఎస్ ప్రత్యేక టీమ్స్ ని, ఐటి సెల్ అధికారులను అభినందించారు.. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి కృషి చెయ్యాలని వారికి సూచించారు..

ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని సూచనలు చేశారు కమిషనర్.. దొంగలించబడిన, లేదా దొరికిన మొబైల్స్ ను కొనడం గానీ, అమ్మడం గానీ చెయ్యకూడదని తెలిపారు.. అలాగే సరైన బిల్ ఉంటేనే మొబైల్ కొనాలని సూచించారు.. అదే విధంగా మొబైల్ ఫోన్స్ లో ఎంతో విలువైన డాక్యుమెంట్స్, వ్యక్తిగత సమాచారం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలాగే ఎక్కువ గుంపులుగా ఉన్నచోట జాగ్రత్తగా వుండాలని.. అలాంటి చోట దొంగలు ఉంటారని తెలిపారు.. అలాగే బలమైన పాస్ వర్డ్స్ ఉపయోగించాలని తెలిపారు..అదే విధంగా ఫైండ్ మై డివైస్ లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. ఒక వేళ మొబైల్ పోయినట్లయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments