Monday, June 23, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్మే నెలలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. !

మే నెలలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. !

త్వరలో టీజీ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదల..

తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్‌ పరీక్షలను 2025 మే మొదటి వారంలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగానికి మూడు రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాలకు రెండు రోజులపాటు ఈ తెలంగాణ రాష్ట్ర ఎం సెట్ 2025 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సారి కూడా టీజీ ఎప్‌సెట్‌ 2025 పరీక్షల నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూకే అప్పగించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌ను పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. ఇక పరీక్షల షెడ్యూల్‌ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ వర్గాలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మే రెండో వారంలో టీజీ ఎప్‌సెట్‌ 2025 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షా తేదీలను ఖరారు చేసి.. పూర్తి షెడ్యూల్‌ను జనవరి నెలలో ప్రకటించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలు పూర్తయ్యాకే తెలంగాణ ఎప్‌సెట్‌ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు అర్థమవుతోంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments