సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం..
అధ్యక్షుడిగా టి. కృష్ణ నియామకం..
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో నియామకం..
రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ ఆద్వర్యంలో 25.11.2024 సాయంత్రం 5.00 గంటలకు.. ముఖ్యమైన సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా ఏడాక్ కమిటీని నియమించారు.. ఈ నియామకాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగాయి..
అధ్యక్షులుగా టి కృష్ణ (జీ.హెచ్.ఎం.సి.).. ఉపాధ్యక్షులుగా సంపత్ (సీఎంఎస్), పవన్ (ఎస్.పీ.పీ.), ప్రకాష్ (ఈ.ఎస్.ఐ.), మహేష్.(రాణిగంజ్) లను నియమించగా సెక్రటరీలుగా టికారం (ఈపీఎఫ్), జాయింట్ సెక్రటరీలుగా.రావులకోళ్ళు వెంకటేష్ (జీ.హెచ్.ఎం.సి.),
రాజేష్ (ఏ.ఎస్.ఐ.), జీ.ఎన్. దాస్ (జీ4), యాదగిరి (సాధురం), ఆర్గనైజ్ సెక్రటరీగా దుర్గాచారీ. ట్రెజరర్ గా జగదీష్ (రైల్వే)..లను నియమించడం జరిగింది..