నిధులు మంజూరు చేయించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ పవర్ సబ్ స్టేషన్ నుంచి గాయత్రి నగర్ ఫేస్ 2 ఆర్చ్ వరకు సిసి రోడ్ నిర్మాణం కొరకు ఏయే. 71,00,000 లక్షలు మంజూరు చేయించారు స్థానిక బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి.. అట్టి రోడ్డు పనులను శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీరింగ్ విభాగం ఏఈ రాజ్ కుమార్, కాలనీ సభ్యులతో కలిసి కార్పొరేటర్ పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రోడ్డు పనులలో నాణ్యత పాటించాలని, లెవెల్స్ సరి చూసుకుంటూ నిర్మాణం పనులు చేపట్టాలని.. కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.