Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణరేపటినుంచి మూడు రోజులపాటు వార్డుసభలు..

రేపటినుంచి మూడు రోజులపాటు వార్డుసభలు..

బడంగ్ పేట్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా నిర్వహణ..
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై సమీక్ష..
దరఖాస్తు చేయనివారు ఈ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఒక ప్రకటన ద్వారా తెలియజేసిన బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్..

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలమేరకు బడంగ్ పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డులలో రేపటినుంచి అనగా 21 డిసెంబర్ 2025 నుంచి 23 డిసెంబర్ 2025 వరకు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డుకు సంబంధించి వార్డుల వారీగా వార్డు సభలు నిర్వహించబడును.. ఇట్టి వార్డు సభలలో గౌరవ కార్పొరేటర్లు, కో అప్షన్ మెంబర్లు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారని తెలియజేయడమైనది.. ఇట్టి సభలలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే పరిశీలించబడును.. ఇంకా వీటికి సంబంధించి దరఖాస్తు చేయనివారు దరఖాస్తు చేసుకొనవచ్చు.. రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా పేర్లు నమోదుచేసుకొనబడునని బడంగ్ పేట్ నగరపాలక సంస్థ కమిషనర్ తెలియజేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments