ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకురాలు, ఎస్.కె. ప్రసన్న..
రేవంత్ రెడ్డి టీపీసీసీ హోదాలో ఉన్న సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా 2023 ఏడాదిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి.. ప్రజల కష్ట సుఖాలను అన్నిటిని తెలుసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఇందిరమ్మ రాజ్యంలో అందరికి మేలు జరుగుతుందని చెప్పిన రేవంత్ మాటలు ఇటు ప్రజల్లో, రైతుల్లో, నిరుద్యోగ యువతలో మీపై అత్యంత విశ్వాసం, నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. కానీ ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇతరత్రా అంశాలపై మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకురాలు ఎస్ కె ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు..
గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం చేసిన అప్పుల కుంపటిని, ఆర్థిక విధ్వంసాన్ని.. వారు చేసిన తప్పిదాలను గత అసెంబ్లీలో రేవంత్ అసెంబ్లీ సాక్షిగా శ్వేతప్రతాన్ని విడుదల చేసినప్పటికీ, ప్రజల్లో వారు చేసిన తప్పిదాలను ఎండగట్టడంలో అలాగే ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనలేక పోయారు. ఇది ముమ్మాటికి సత్యం.. ఇంటెలిజెన్స్ వారు కూడా ఈ విషయం సీఎం కు తెలిపారని వార్తలు వస్తున్నాయని ఆమె గుర్తుచేశారు.. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ ఈ విషయంలో అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. కొన్ని నిజాలు చేదుగా ఉన్నా వాటిని జీర్ణించుకోలేక తప్పదు అన్నారు..
ఒక స్త్రీ కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది..? ఎన్ని డబ్బులను ఎక్కడ, ఎంత పొదుపుగా ఖర్చు చేస్తోంది.. అన్న విషయాలు రేవంత్ కి తెలియనిది కాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా చక్కగా పరిపాలించారు.. దివంగత సీఎం వై ఎస్ ఆర్.. ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య, ఇలా ఎంతో మంది ఉద్దండులు ఈ రాష్టాన్ని పరిపాలించారు.. .కానీ రేవంత్ లాగా రాష్ట ఆర్థిక పరిస్థితి గురించి ఇంత దారుణంగా మాట్లాడలేదు.. అదికూడా ఉద్యోగుల విషయంలో.. ఇది రేవంత్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం అని ఆమె సూచించారు.. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలను అన్వేషించవచ్చు. ఏ పథకన్నీ తీసివేయాలో చెప్పాలని ఉద్యోగులను అడిగితే ఏం చెబుతాము.. పథకాలను ప్రవేశ పెట్టేముందు మాకు చెప్పి ప్రవేశ పెట్టరా? అని ప్రశ్నించారు..
రేవంత్ ప్రభుత్వంలో చేస్తున్న తప్పిదాలను సరి చేసుకుంటే, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
ఈ ప్రభుత్వంలో చేస్తున్న దుబారాను పూర్తిగా కట్టడి చేసుకోవాలి.. ఇది వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.. ఉదాహరణకు మంత్రులు పర్యటనల కోసం హెలికాప్టర్ లో పోవాల్సిన అవసరం ఏముంది..? అలాగే ఒక్కొక్క మంత్రి వద్ద ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.? వారికి జీతభత్యాలు ఏ రకంగా ఇస్తున్నారు..? ఉన్న ఉద్యోగులను డిప్యుటేషన్ ద్వారా తీసుకుంటే ఆర్ధికంగా ఎంతో కుదుటపడవచ్చు అని ఆమె సూచించారు..
రిటైర్డ్ ఉద్యోగులను వేల సంఖ్యలో తీసుకొని, వారికి లక్షల్లో జీతాలు ఇచ్చుకుంటూ చేస్తున్న దుబారా కట్టడి చేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు..? ఒకసారి జీవో ఇచ్చి తీసివేస్తామని చెబుతూనే.. మరో జిఓ ఇచ్చి అదే ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు.. ఇది ఎంతవరకు న్యాయమో సీఎం ఆలోచించాలని ఆమె అన్నారు.. అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి పత్రికలో అడ్వర్టైజ్ మెంట్ల కోసం లక్షలు, కోట్లు ఖర్చు అవుతున్నాయి.. ఆ దుబారాను కూడా తగ్గించుకోండి అని సలహా ఇచ్చారు.. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తీసుకుంటున్న వేతనాలు ఆర్థిక శాఖకు మరల్చాలి.. అంతంత వేతనాలు ఎందుకు..? కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గలవారు ప్రజాసేవ చేసేందుకు వచ్చినారు కాబట్టి, వారి వారి జీతాలను కూడా ప్రతి నెల ఆర్థిక శాఖకు ఇవ్వడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
ఇవి కొన్ని సూచనలు మాత్రమే.. ఇంకా ఎన్నో రకాలైన, వేరే అంశాలు కూడా ఉన్నాయి.. ఆర్థిక పరిస్థితిని గట్టు ఎక్కించేందుకు మాకు అవకాశం ఇస్తే.. మేము ఏ విధంగా ఈ పరిస్థితుల్లోంచి బయటపడాలో.. మా దగ్గర అనేక ఆస్త్రాలు, శాస్త్రాలు, అదే విధంగా సలహాలు, సూచనలు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిపుణులైన వ్యక్తి.. కానీ ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎంతోమంది సలహాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు.. వారి అభిప్రాయాలకు తెలుసుకోండి.. లేదంటే మేము చెప్పే సలహాలు తీసుకొని ఈ పరిస్థితులను చక్కదిద్దుకొని రాష్ట్రాన్ని ప్రగతి వైపు నిలిపేందుకు కృషి చేయాలని ఎస్.కె. ప్రసన్న ముఖ్యమంత్రిని కోరారు..