వృద్ధుల బాగోగులు అడిగి తెలుసుకున్న వైనం..
30 వేలరూపాయల విరాళం అందజేత..
కృతజ్ఞతలు తెలిపిన ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్ది శంకర్..
క్రోయాడాన్ తెలుగు అసోసియేషన్, లండన్ ప్రెసిడెంట్ అయిన ప్రవీణ్, వనస్థలిపురం, హైదరాబాద్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఇచట ఆశ్రయం పొందుతున్న వృద్దులు, వయోవృద్దులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్ది శంకర్ కి వృద్ధుల సంక్షేమం నిమిత్తము అసోసియేషన్ తరుపున రూ. 30,000/ నగదును డొనేషన్ గా అందజేసినారు.. పెద్ది శంకర్ లండన్ లోని ఎన్ ఆర్ ఐల దాతృత్వానికి వృద్ధుల తరుపున ధన్యవాదములు తెలియజేస్తూ.. వారు ఇలాగే తమ సహాయ, సహకారములు కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేసినారు. ఆశ్రమంలోని వృద్దులకు మరిన్ని అనువైన సదుపాయాలు ఏర్పరచి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆయన తెలజేసినారు.. ఈ కార్యక్రమంలో పోల్కం ప్రశాంత్, నాగ మోహన్ లు పాల్గొన్నారు..