సరూర్ నగర్ సర్కిల్ కొత్తపేట డివిజన్ లో నిర్వహణ..
పలు సూచనలు చేసిన స్థానిక కార్పొరేటర్..
జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు రాబోవు వర్షాకాలంలో ప్రజారోగ్యము, పారిశుద్ధ్య విషయమై ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి అన్ని సర్కిల్ ల యందు ముందస్తు వర్షాకాల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించినందున, అందులో భాగంగా సోమవారం రోజు సరూర్ నగర్ సర్కిల్ యందు ఈ కార్యక్రమాన్ని.. కొత్తపేట్ డివిజన్ న్యూ నాగోల్ నందు నైకోటి పవన్ కుమార్ ఈస్ట్ మారుతీ నగర్, గాయత్రి పురం, ఎస్ ఆర్ ఎల్ కాలనీ, సి పి ఓ కాలనీ, సమతాపురి కాలనీ, శృంగేరి కాలనీ, న్యూ నాగోల్ ఆర్ టి సి కాలనీ, శివ గంగ కాలనీ, భరత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ల యందు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. కాలనీల రోడ్లను, ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి.. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి.. చెత్తను ఎత్తివేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ పారిశుద్ధ్య విభాగం డిఈ చందన చౌహాన్, సానిటరీ సూపర్వైజర్ బుచ్చయ్య, ఎస్ ఎఫ్ ఏ లు, జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పోరేటర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈరోజు నుండి మూడు రోజులు జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇండ్ల నుండి, వ్యాపార స్థలాల నుండి వెలువడే చెత్తా చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడ వేయకుండా జిహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో వారికి అందించాలని, ఎక్కడపడితే అక్కడ పడవేయడం వలన వర్షాకాలంలో నాలాలు, మోరీలు చెత్తతో నిండిపోవడం వలన వర్షం నీరు కాలనీలలో నిలిచిపోయి దుర్వాసన, ప్రాణాంతకమైన అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున.. ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని.. ఇంటి పరిసరాలలో నీరు నిలువకుండా చూసుకోవాలని అందువల్ల దోమలు అభివృద్ధి చెందకుండా మన వంతు బాధ్యతగా ఉండాలని సూచించారు..