హామీ ఇచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీలో జరుగుతున్న నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ డివిజన్ నగర శివారులో ఉండడంవల్ల డివిజన్ లోని చాలా కాలనీలలో మౌలిక వసతుల కొరత ఉందని.. గడచిన నాలుగున్నర సంవత్సరాలలో మౌలిక వసతుల సదుపాయాలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చి.. చాలా కాలనీలలో భూగర్భ డ్రైనేజ్, మంచి నీటి పైప్ లైన్ సదుపాయం.. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.. రాబోవు రోజుల్లో కూడా హయత్ నగర్ డివిజన్ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.. ఈ పరిశీలనలో వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..


