ఎల్బీనగర్:
భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మన్సూరాబాద్ సహారా రోడ్డులో పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిడికిలి రాజు, మేడిగ శ్రీధర్, శనిగరపు స్వామి, బొంగు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


