సావిత్రి పూలే విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించిన పలువురు..
సావిత్రిబాయి పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం..
సోమవారం రోజు విద్యా జ్యోతి భారత దేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా మన్సురాబాద్ సహారా వద్ద సావిత్రిబాయి పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో.. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూలే యువజన సంఘం సభ్యులు మేడిగ శ్రీధర్, శనిగరపు స్వామి, చామకూర రాజు, కె వి గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్, నకరికంటి శ్రీనివాస్, నేరడ సైదులు, బొంగు వెంకటేష్ గౌడ్, సోమేశ్ కుమార్, నరేష్ చారి పాల్గొన్నారు..