Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు..

ఈ నేపథ్యంలో బస్ స్టాప్ లను పరిశీలించిన కమిషనర్ ఆర్.వి. కర్ణన్..
హెచ్ సిటీ ద్వారా రసూల్‌పురా వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించాలి..
తక్షణమే భూసేకరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు..
రైల్వే సరిహద్దు నుండి 24 మీటర్ల వరకు భూమి అవసరం అవుతుంది..
కమిషనర్ కు తెలిపిన అధికారులు..
బస్ స్టాప్‌కు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి దానిని తరలించాలి..
కమిషనర్ ను అభ్యర్ధించిన ప్రాజెక్ట్ ఎస్.ఇ. శ్రీనివాస్..

రసూల్ పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిప పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో గురువారం కమిషనర్ సికింద్రాబాద్ జోన్ లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్ స్టాప్‌లను పరిశీలించారు. రైల్వే సరిహద్దు నుండి 24 మీటర్ల వరకు భూమి అవసరం ఉందని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు. బస్ స్టాప్‌కు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి దానిని తరలించాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ ఎస్.ఇ. శ్రీనివాస్ కమిషనర్‌ కు వివరించారు. ఈ సందర్భంగా కమీషనర్ హెచ్ సిటీ ద్వారా రసూల్‌పుర వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని వెంటనే పరిశీలించి భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments