Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణసీసీ రోడ్ పనులు ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్..

సీసీ రోడ్ పనులు ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్..

సూర్య నగర్ ఈస్ట్ నుండి పద్మాలయ నగర్ కాలనీ వరకు రోడ్..
కోటి నలభై లక్షల నిధుల కేటాయింపు..
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

హయత్ నగర్ డివిజన్ 13లో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.. శనివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.. హయత్ నగర్ డివిజన్ 13లో సూర్య నగర్ (ఈస్ట్) కాలనీ, రోడ్ నెంబర్ 5 నుండి పద్మాలయ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 8 వరకు.. జిహెచ్ఎంసి నిధులనుండి కోటి నలభై లక్షల నిధులచే.. ఈ పనులను ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కల్లెం నవ జీవన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సూర్య నగర్ పద్మాలయ కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి గౌడ్, జి. నరసింహులు, యాదయ్య, ఎస్. శేఖర్, ఎస్. విజయ్ కుమార్, జి. శంకర్, కరుణాకర్ రెడ్డి, బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, నరసింహ, వీరారెడ్డి, ఆర్. సంతోష్, భగవంతు రెడ్డి, యాదగిరి గౌడ్, భూపాల్ రెడ్డి, వి. శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ఎం. కిరణ్, మాధవరెడ్డి, డి. నరసయ్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్, నవీన్, వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments