సి.పీ.ఎన్.ఆర్. ఫౌండేషన్ తరపున రూ. 50 వేలు
అందజేసిన చైర్మన్ చిగిరింత దయాసాగర్ రెడ్డి..
గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగిరింత నర్సింహ రెడ్డి జన్మదినాన్ని పురష్కరించుకుని ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో సెలూను షాపు ఏర్పాటు కోసం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిర్వాహకుడు సుశాంత్ కి సిపిఎన్ ఆర్ ఫౌండేషన్ తరుపున 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఫౌండేషన్ ఛైర్మన్ చిగిరింత దయాసాగర్ రెడ్డి.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు సెలూన్ షాపు నిర్వాహకుడు సుశాంత్..