వీ.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు సాగిన యాత్ర..
ఆపరేషన్ సింధూర్ లో వీరోచిత పోరాటం చేసిన సైనికులకు బాసట..
కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని, నిజాంపేట్ బాచుపల్లి రోడ్డులో గల వీ.ఎన్. ఆర్.విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ తో యుద్ధం చేసిన సైనికులకు మద్దతుగా జై హింద్ యాత్రను చేపట్టారు.. ఈ కార్యక్రమానికి అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి హాజరై పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ కమిటీ ఛైర్మన్ కల్నల్ రోహిత్ చౌదరి లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



