భారత్లో స్టార్లింక్కు లైసెన్స్ ఇవ్వడాన్ని ప్రశంసించిన షాట్వెల్
శాటిలైట్ కమ్యూనికేషన్లలో సహకారంపై ఫలవంతమైన చర్చలు
భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్లింక్కు లైసెన్స్ మంజూరు కావడంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్వినే షాట్వెల్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగిందని, భారత్లో స్టార్లింక్కు లైసెన్స్ ఇవ్వడాన్ని షాట్వెల్ ప్రశంసించారని మంత్రి తెలిపారు.
ఈ సమావేశం గురించి కేంద్ర మంత్రి సింధియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “భారతదేశంలో కనెక్టివిటీ రంగంలో తదుపరి దశకు సంబంధించి స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ సీఓఓ గ్వినే షాట్వెల్తో ఫలవంతమైన సమావేశం జరిగింది. డిజిటల్ ఇండియా యొక్క అపారమైన ఆకాంక్షలకు ఊతమివ్వడానికి, దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడానికి శాటిలైట్ కమ్యూనికేషన్లలో సహకార అవకాశాలపై లోతుగా చర్చించాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోందని, ఈ తరుణంలో శాటిలైట్ సాంకేతికతలు కేవలం సంబంధితమైనవి మాత్రమే కాకుండా, పరివర్తనాత్మకమైనవని సింధియా అభిప్రాయపడ్డారు. స్టార్లింక్కు లైసెన్స్ మంజూరు చేయడం ఈ ప్రయాణంలో గొప్ప ప్రారంభమని షాట్వెల్ అన్నట్లు మంత్రి తెలిపారు.