ఎల్బీనగర్:
కొత్తపేట హుడా కాంప్లెక్స్ లో యంగ్ రేస్ ఆర్గనైజేషన్, ప్రణవ గ్రూప్, యశోద హాస్పిటల్ సంయుక్తంగా చేపట్టిన ఉచిత మెగా హెల్త్ శిబిరం నిర్వహించారు.. ఈ రోజుల్లో బిజి లైఫ్ లో ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకపోవడంతో కల్తీ ఆహారం, నీరు పొల్యూషన్స్ వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ మెగా హెల్త్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అన్ని విభాగాల డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి తగిన మందులు పంపిణీ చేశారు. ప్రజలు ప్రతి ఆరు నెలలు ఒకసారి వైద్య పరీక్షలు చేసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆరుట్ల సురేష్,లోకసాని కొండల్ రెడ్డి,యానాల రవీందర్ రెడ్డి, పవన్, సూగూరప్ప, ఆకుల అరుణ్, పప్పీ మనోహర్, బొడ్డు ప్రవీణ్, శివ, గణేష్, అరవింద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


