Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణహైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు..

హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు..

కూల్చివేతలకు సంబంధించి హైడ్రా వివరణ..
మీడియాకు వెల్లడించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్..

కూల్చివేతలు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూలంకుషంగా వివరణ ఇచ్చారు.. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు.. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చెక్ చేస్తాం అన్నారు రంగనాధ్..

అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా, ఎఫ్.టి.ఎల్. లో ఉంటే కూల్చడం జరుగుతుందని హెచ్చరించారు.. గతంలో అనుమతులు ఇచ్చి.. తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయి. అవి నివాసాలు అయినా సరే.. జులై తరువాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చడం జరుగుతుందని తెలిపారు.. .
పేదలను ముందు పెట్టి.. వెనుకనుండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. ఉదాహరణకు చింతల చెరువు, గాజులరామారం, మాదాపూర్ లోని సున్నం చెరువులో కూల్చివేతలు ఈ కేటగిరీలోకి వస్తాయి.. కోర్టు ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుంది. హైడ్రా ఆవిర్భావం తర్వాత అనుమతి ఇచ్చి ఉన్నా, లేకున్నా ఎఫ్.టి.ఎల్. లో వుంటే కూల్చడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగతుందని తెలిపారు..

ఇక ఎఫ్.టి.ఎల్. పరిధిలో అనుమతి లేకుండా ఉన్న కమర్షియల్ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తుంది. హైదరాబాద్ లో చెరువుల ఎఫ్.టి.ఎల్. మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టింది. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. త్వరలో యీ ప్రక్రియను పూర్తి చేస్తాం అన్నారు.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుంది. హైడ్రా కూల్చివేతలు చేసిన తరువాత, ఆ ప్రాంతం ప్రజావసరాల కోసం వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ప్రాధాన్యతను యిస్తుంది. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం.. ఆ చెరువుల పునరుద్దరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం అని తెలిపారు.. చెరువులు, పార్కులతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి సంస్థ దేశంలోనే మొట్ట మొదటిది. గత 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోంది. ఏమన్నా లోటు పాట్లు ఉంటే వాటిని సవరించుకొని మరింత దృఢంగా నిబద్ధతతో పని చేస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది అన్నారు..

భావితరాల భవిష్యత్ బాగుండాలని, పర్యావరణ హితమైన,మెరుగైన ప్రజా జీవనం కోసం నగర ప్రజలు హైడ్రా కు సహకరిస్తున్నారు. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుంది. హైడ్రాను బలోపేతం చేయడానికి వివిధ చట్టాల కింద ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెడుతూ వస్తోంది. టెక్నాలజీ పరంగా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల చెరువు, ప్రభుత్వ భూములు, పార్కులను స్వాధీనం చేసుకున్నది. ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రా పై నమ్మకం తో ఫిర్యాదులు చేస్తున్నారు. యిలా 5000 పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించింది. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటున్నాం. ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపించే దిశగా హైడ్రా పని తీరు వుంటుంది. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భూ కబ్జాల వెనక ఉన్న పాత్ర దారులు, సూత్ర దారుల మీద చట్ట పరంగా కటిన చర్యలు హైడ్రా తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments