Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణ100 రోజుల ప్రణాళికలో భాగంగా 12 రోజు కార్యక్రమం..

100 రోజుల ప్రణాళికలో భాగంగా 12 రోజు కార్యక్రమం..

బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ..
కమీషనర్ పీ. సరస్వతి ఆధ్వర్యంలో కార్యక్రమం..

కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం రోజు బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ పి. సరస్వతి అధ్వర్యంలో 12వ రోజు కార్యక్రమంలో భాగంగా అల్మాస్ గూడ, మల్లాపూర్ లోని మలేరియా, డెంగ్యూలపై కమీషనర్ మాట్లడాతూ.. డెంగ్యూ జ్వరం అనేది బాధకరమైన, బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, రెండవ సారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా తక్కువ.. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దర్లు, తల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు.. కొన్ని తీవ్రమైన కేసుల్లో షాక్ కు దారితీస్తాయి. ఇది ప్రాణాంతకం అని అవగాహన కల్పించారు.. అలాగే బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ తో సమావేశం నిర్వహించి వీధి విక్రతేల సాధారణ ఆసక్తిగల సమూహలు కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి సమావేశం నిర్వహించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ శ్యామ్ సుందర్, డీఈ వెంకన్న, ఆర్.ఓ. వేణుగోపాల్ రెడ్డి, మేనేజర్ నగేశ్వరరావు, ఎస్.ఐ. వంకాయల యాదగిరి, టి.ఎం.సి. శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, సానిటేషన్ సిబ్బంది, ఆర్.పీ.లు, ఎస్.హెచ్.జీ. మహిళలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments