బడంగ్ పేట్ మున్సిపల్ పరిధిలో నిర్వహణ..
కమిషనర్ సరస్వతి ఆధ్వర్యంలో సమావేశం..
కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం రోజు బడంగ్ పేట్ పరిధిలో కమీషనర్ పి. సరస్వతి అధ్వర్యంలో 13వ రోజు కార్యక్రమంలో భాగంగా బడంగ్ పేట్ 21వ వార్డులో ద్వాక్రా భవనము నందు సమావేశం నిర్వహించి, వీధి విక్రతేల సాధారణ ఆసక్తిగల సమూహలు, కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి వివరించడం జరిగినది.. తదనంతరం తడి పొడి చెత్త వేరు చేసి, స్వచ్చ ఆటోకి ఇవ్వాలని ప్రజలకు అవగాహాన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. శ్యామ్ సుందర్, డీఈ వెంకన్న, ఆర్.ఓ. వేణుగోపాల్ రెడ్డి, మేనేజర్ నగేశ్వరరావు, ఎస్.ఐ. వంకాయల యాదగిరి, టి.ఎం.సి. శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, సానిటేషన్ సిబ్బంది, ఆర్.పీ.లు, ఎస్.హెచ్.జీ. మహిళలు పాల్గొన్నారు..