Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణ42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపి ఓబీసీ లాయర్లు జాక్..

42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపి ఓబీసీ లాయర్లు జాక్..

ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అన్ని రాజకీయ పక్షాలకు అభినందనలు తెలిపిన జాక్..

స్థానిక సంస్థల లో 42 శాతం బిసి రిజర్వేషన్ లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు
ఓబీసీ లాయర్స్ జాక్ ( జె.ఏ.సి. ) మద్దతు తెలిపింది.. ఈ బిల్లును శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన, అందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు ఓబిసి లాయర్స్ జాక్ అభినందనలు తెలియజేసింది.. అదే విధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.. ఈ చట్టంతో న్యాయపరంగా అన్ని లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఉన్నటువంటి ఏజీపీ జి పి, అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాలలో 42శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.. ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా జాక్ విజ్ఞప్తి చేసింది.. ఇక ఓబీసీ లాయర్ల జాక్ ఉద్యమిస్తుందని వారు తెలియజేశారు..

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని త్రికరణశుద్ధితో పార్లమెంట్ లో అమలు చేసి, రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.. తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి, ఈ చట్టానికి ఉన్న అవరోధాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాక్ కోరుతోంది.. లేనిపక్షంలో మా ఓబిసి లాయర్ జె.ఏ.సి. మిగతా ఓబీసీ సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు..

ఈనెల 31/03/2025 అన్ని సంఘాలతో ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలియచేశారు. ఇదే సమయంలో అన్ని న్యాయవాద సంఘాలు, కులాల వారీగా ఏర్పాటు చేసుకున్న న్యాయవాద సంఘాలు, అన్ని సంఘాల నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.. వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి న్యాయవాద కుల సంఘాల నాయకులు, వృత్తి సంఘాల నాయకులు అందరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో ఓబీసీ లాయర్లు జె.ఏ.సి. చైర్మన్ తలకొక్కుల రాజు.. కాంగ్రెస్ పార్టీ, లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్.. ఓబీసీ డెమొక్రాటిక్ జె.ఏ.సి. కన్వీనర్ కోల జనార్దన్ తో బాటు ఐ.ఎల్.పీ.ఏ. స్టేట్ ప్రెసిడెంట్ దేవరాజు గౌడ్, పూసా మల్లేశం, టి. రాహుల్, వంశీకృష్ణ, న్యాయవాదుల జాక్ కన్వీనర్స్, అసోసియేట్ సెక్రెటరీ కొండూరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments