Monday, June 23, 2025
Google search engine
Homeనేషనల్ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు..

ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు..

ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ ఛైర్‌పర్సన్‌గా నియామకం..
ఉత్తర్వులు జారే చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ..
రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణపై అధ్యయనం చేయనున్న కమిటీ..
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ డీకే అరుణ..

తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు, సీనియర్ నాయకురాలు డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థకు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలోని ఆహార ధాన్యాల సేకరణ, సంబంధిత అంశాలపై డీకే అరుణ ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ కమిటీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల లభ్యత, ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై లోతైన అధ్యయనం చేస్తుంది.. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి, తగిన సిఫార్సులను ప్రభుత్వానికి అందించడంలో ఈ కమిటీ ముఖ్యమైన పాత్రను పోషించనుంది. రాష్ట్ర రైతాంగం, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ తన విధులను నిర్వర్తిస్తుంది. తనకు ఈ నూతన బాధ్యతలు అప్పగించినందుకు డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments