తొక్కిసలాటలో ఇద్దరు దుర్మరణం..
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. సంబురాలు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2025లో సీజన్లో ఆర్సీబీ ట్రోఫీ గెలువడంతో వాళ్ల హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. సంబురాలు మొదలవగానే గేట్లు తెరువడంతో అందరూ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.