Monday, June 23, 2025
Google search engine
HomeUncategorizedఐపీల్ మెగా వేలం… స్టార్ ఆటగాళ్లుకు ఎంత ధర పలుకుతుందో?

ఐపీల్ మెగా వేలం… స్టార్ ఆటగాళ్లుకు ఎంత ధర పలుకుతుందో?

మొదటిసారి వేలంలో పాల్గొననున్న జేమ్స్ ఆండర్సన్…
ఇండియన్ స్టార్ ఆటగాళ్లపై అందరి ఆసక్తి…
తొలిసారి వేలంలోకి ఇటలీ ప్లేయర్…

ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న వేళా కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్‌–2025 వేలం జరుగుతుంది.ఇందులో భారత్‌ స్టార్ ప్లేయర్లు అయినా రిషబ్‌ పంత్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, నటరాజన్‌, ఇషాన్‌ కిషన్‌,కృనాల్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్, దేవదత్‌ పడిక్కల్‌ , మొహమ్మద్‌ షమీ,మొహమ్మద్‌ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, హర్షల్‌ పటేల్, దీపక్‌ చహర్, శార్దూల్‌ ఠాకూర్, హర్షల్‌ పటేల్, ప్రసిధ్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్, అశ్విన్‌, యుజువేంద్ర చహల్‌ తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

అయితే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ ఈసారి ఐపీఎల్‌ వేలానికి దూరమయ్యాడు.అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తొలిసారి ఐపీఎల్‌ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్‌ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే టి20 అండర్సన్‌ మ్యాచ్‌ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది.
అండర్సన్‌ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

గత వేలంలో అత్యధిక ధర రూ. 24 కోట్ల 50 లక్షలు పలికిన ఆ్రస్టేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో పాటు, ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు.

గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు, ఫామ్‌లో లేని ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో వున్నారు. ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్‌ నుంచి 52 మంది, న్యూజిలాండ్‌ నుంచి 39 మంది, వెస్టిండీస్‌ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్‌ తమ పేరు నమోదు చేసుకున్నారు.

ఇటలీ నుంచి తొలిసారి పేసర్‌ థామస్‌ డ్రాకా ఐపీఎల్‌ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్‌ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది.నేత్రావల్కర్‌ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments