- టీఐటీఎంసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం..
- పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అడుగులు..
- కీలక నిర్ణయం తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం..
తిరుమలలో పర్యావరణ సమస్యలతో పాటు వాహనాల రాకపోకలు నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా తిరుమల ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ తక్షణమే అవసరమని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల లో పర్యావరణ సమస్యలతో పాటు వాహనాల రాకపోకలు నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా తిరుమల ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ తక్షణమే అవసరమని ఆయన అన్నారు.. ఈ మేరకు గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సీవీఎస్వో శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ నిర్వహణపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.