Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణనగరంలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్..

నగరంలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్..

  • వరదనీరు నిలుస్తున్న ప్రాంతాలు, ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రదేశాల పరిశీలన..
  • క్షేత్ర స్థాయిలో సమస్యలపై సమీక్ష..
  • ఇక వరదముప్పు లేకుండా చేయాలన్నదే లక్ష్యం..

వ‌ర‌ద నీరు నిలుస్తున్న ప్రాంతాల‌తో పాటు ట్రాఫిక్ స్తంభిస్తున్న ప్రాంతాల‌ను క్షేత్ర స్థాయిలో శ‌నివారం నాడు పరిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్.. హైడ్రా, ట్రాఫిక్‌, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ల‌ను స‌మీక్షించిన ఇరువురు అధికారులు. లకడికపూల్, రాజ్ భవన్ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పోయింట్లను తనిఖీ చేసి వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు. లకడికాపూల్ పరిసర ప్రాంతాల్లో గతంలో వుండే వరద నీటి కాలువ శిథిలమైన తీరును గమనించి పున‌రుద్ధ‌రించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌..

ద్వారక హోటల్ ముందు నుంచి లక్కీ రెస్టారెంట్ మీదుగా భూగర్భ కాలువ ద్వారా గతంలో వరద నీరు సాఫీగా ప్రవహించేద‌ని.. ఈ కాలువ ఎక్క‌డిక‌క్క‌డ శిథిల‌మై, పూడుకుపోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని వివరించారు జీహెచ్ ఎంసీ స‌ర్కిల్ 17 ఈఈ వెంక‌ట నారాయ‌ణ‌. గ‌తంలో ఈ వ‌ర‌దంతా ల‌క‌డికాపూల్‌రైల్వే వంతెన కింద‌కు సాఫీగా సాగేద‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ కాలువ‌ను పున‌రుద్ధ‌రించాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు..

ల‌క‌డికాపూల్ చౌర‌స్తాలో వ‌ర‌ద‌నీటి కాలువ ప్ర‌వ‌హించే తీరును ఆశాంతం ప‌రిశీలించి.. రైల్వే వంతెన కింద‌కు వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హించ‌కుండా ఉన్న అడ్డంకుల‌ను రైల్వే ట్రాక్ మార్గంలో న‌డిచి ఇరువురు అధికారులు పరిశీలించారు.. వారం రోజుల‌లో వ‌ర‌ద కాలువ‌ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని.. అప్ప‌టికీ వ‌ర‌ద ముప్పు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఈ వ‌ర్షాకాలానికి తాత్కాలిక చ‌ర్య‌లు చేప‌ట్టి.. వచ్చే వేస‌విలో కాలువ‌ను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు. అక్క‌డిక‌క్క‌డే జోన‌ల్ క‌మిష‌న‌ర్ అనురాగ్ జ‌యంతితో మాట్లాడి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందంతో క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఏవీ రంగ‌నాథ్ చర్చించారు..

అనంత‌రం వారు రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో వాట‌ర్‌ లాగింగ్ పాయింట్ల‌ను పరిశీలించారు.. రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో 10 ల‌క్ష‌ల లీట‌ర్ల‌కు పైగా సామ‌ర్థ్యం ఉన్న రైన్ వాట‌ర్ హోల్డింగ్‌ నిర్మాణాలను పరిశీలించారు.. గ‌తంలో 2 సెంటీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్షం ప‌డితే రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో నీరు నిలుచుండేద‌ని.. ఈ వాట‌ర్ హోల్డింగ్ నిర్మాణాల‌తో 5 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం వ‌ర‌కూ వ‌ర‌ద ముప్పు తొలిగింద‌న్న స్థానిక అధికారులు. 5 సెంటీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్షం ప‌డితే అక్క‌డ చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌తో పాటు.. వాట‌ర్ ఇంజిన్లు పెట్టి తోడించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించిన అధికారులు. ఇలా న‌గ‌రంలోని 30 ప్ర‌ధాన‌మైన వాట‌ర్‌లాగింగ్ ప్రాంతాల ముప్పును తొలుతు తొల‌గించాల‌ని నిర్ణ‌యం. కాగా వారం రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అవే ప్రాంతాల‌లో ట్రాఫిక్‌, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ప‌నుల పురోగ‌తిని, స‌మ‌స్య ప‌రిష్కారం అయిన తీరును తెలుసుకోవాలంటూ నిర్ణ‌యం తీసుకున్నారు.. న‌గ‌రం మొత్త‌మ్మీద ఎక్క‌డా వ‌ర‌ద నీటిలో ర‌హ‌దారులు మున‌గ‌కుండా చూడాల‌నేది హైడ్రా ల‌క్ష్యంగా తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments