సీరియస్ గా స్పందించిన కేటీఆర్..
దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలి..
తెలంగాణాలో వేలకోట్ల అభివృద్ధి జరిగింది..
కేంద్రం ప్రకటించిన లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి..
కేసీఆఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రాచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగాణలో వేల కోట్ల అభివృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన లెక్కలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ చురకలంటించారు. కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా మారలని సూచించారు. పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేండ్లు పండగేనని చెప్పారు. కులవృత్తులకూ కేసీఆర్ కొండంత అండగా నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధి సాధించని తెలిపారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం తమదని వెల్లడించారు.