- బేగంపేట్ విమానాశ్రయానికి భారీగా తరలిన కార్యకర్తలు..
- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం..
బోయిన్ పల్లిలోని ఇందిరాగాంధీ ఆడిటోరియంలో తెలంగాణలో జరగనున్న కులగణన సర్వేకు దిశానిర్ధేశం చేసేందుకు విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు.. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో.. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బేగంపేట విమానాశ్రయానికి భారీగా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.. తమ అభిమాన నాయకుడి కోసం ఉత్సాహంగా కదిలారు..