- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా కార్యక్రమం..
- సరూర్ నగర్, ఆర్.కె. పురం డివిజన్ లబ్ధిదారులకు అందజేత..
- సరూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయం వేదికగా పంపిణీ..
బుధవారం రోజు మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా సరూర్ నగర్, ఆర్.కె. పురం డివిజన్ పరిధిలలో ప్రభుత్వం నుండి మంజూరైన ” కళ్యాణి లక్ష్మి “, ” షాదీ ముబారక్ “, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను.. పంపిణీ చేశారు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు ఆమె అందజేశారు.. కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఇంటర్ మీడియట్ కళాశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్, కళాశాల అధ్యాపకులు, భారాసా పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు..