చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులో నిందితుడు..
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన శనిమళ్ల అఖిల్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, వెంబడించి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలో క్రైమ్ నెంబర్ 77/2022 కేసులో నిందితుడు శనిమల్ల అఖిల్ తండ్రి కాశీరామ్ ఇతని వయస్సు 21 సంవత్సరాలు.. వృత్తి డ్రైవర్, కులం: ఎస్సీ.. నివాసం అయ్యప్ప కాలనీ, తట్టిఅన్నారం, అబ్దుల్లాపూర్మెట్, రంగారెడ్డి జిల్లా.. ఇతనికి పోక్సో చట్టం ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో యూ/ఎస్ 354,354( డీ ), 506 ఐపీసీ మరియు సెక్షన్ 11 అండ్ 12 ఆఫ్ పోక్సో చట్టం, చైతన్యపురి స్టేషన్ ఎస్సీ నెంబర్ 432/2022, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్లోని గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిని బుధవారం రోజున, దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష తో బాటు రూ.11,000/- జరిమానా విధించబడింది.. బాధితురాలికి నష్టపరిహారం రూ. 1,00,000/- అందించబడింది. కాగా ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.