Friday, June 20, 2025
Google search engine
Homeక్రైమ్ స్పెషల్నిందితుడికి మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష..

నిందితుడికి మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష..

చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులో నిందితుడు..
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన శనిమళ్ల అఖిల్..

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, వెంబడించి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలో క్రైమ్ నెంబర్ 77/2022 కేసులో నిందితుడు శనిమల్ల అఖిల్ తండ్రి కాశీరామ్ ఇతని వయస్సు 21 సంవత్సరాలు.. వృత్తి డ్రైవర్, కులం: ఎస్సీ.. నివాసం అయ్యప్ప కాలనీ, తట్టిఅన్నారం, అబ్దుల్లాపూర్మెట్, రంగారెడ్డి జిల్లా.. ఇతనికి పోక్సో చట్టం ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో యూ/ఎస్ 354,354( డీ ), 506 ఐపీసీ మరియు సెక్షన్ 11 అండ్ 12 ఆఫ్ పోక్సో చట్టం, చైతన్యపురి స్టేషన్ ఎస్సీ నెంబర్ 432/2022, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్‌లోని గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిని బుధవారం రోజున, దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష తో బాటు రూ.11,000/- జరిమానా విధించబడింది.. బాధితురాలికి నష్టపరిహారం రూ. 1,00,000/- అందించబడింది. కాగా ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments