వెల్లడించిన ఇజ్రాయెల్ సైన్యం..
టెహ్రాన్లోని కమాండ్ సెంటర్పై ఇజ్రాయెల్ మెరుపు దాడి..
ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ హతం..
టెహ్రాన్లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. “సోమవారం రాత్రి అకస్మాత్తుగా లభించిన అవకాశంతో ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్ నగరంలోని ఒక కమాండ్ సెంటర్పై దాడి చేసింది. ఈ దాడిలో అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన అలీ షాద్మానీ హతమయ్యారు” అని తెలిపింది.
అలీ షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు రెండింటికీ కమాండర్గా వ్యవహరించారని కూడా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ దాడి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రకటనపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.