హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్..
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాలనీల అభివృద్ధి అన్న మంత్రి..
శనివారం రోజు మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్స్ కు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డిలు కలసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషితో ప్రభుత్వం ఎస్.డీ.ఎఫ్. నిధులు రూ. 10 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణా పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల, శ్రీ రామకృష్ణా పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత, యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి గడ్డి, అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్, ఖిల్లా మైసమ్మ ఛైర్మన్ సురేందర్ కుమార్ రమేష్ నేత, ఎన్.ఎస్.యూ.ఐ. శివ, భూపాల్ రెడ్డి, పందుల వెంకటేష్ గౌడ్, జెల్ల జగన్నాథం, దోర్నాల చంద్రమౌళి, నానవాల జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్,పెద్దవూర సైదులు, శేఖర్ ముదిరాజ్, పగడాల శ్రీశైలం, కళ్యాణ్ యాదవ్, లింగ స్వామి గౌడ్, షఫీ, మహేందర్, రాజు నాయక్, ఇమ్రాన్, ఎల్లన్న, శ్రీకాంత్, ప్రేమ్ నాయక్, నభీ, శ్రీధర్, చందు, సూరి, మహ్మద్, పటేల్, నాగేష్, సంతోష్, భాస్కర్ నాయక్, అనుదీప్ తో బాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.