కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..
ఆవేదన వ్యక్తం చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు..
గురువారం రోజు హైదరాబాద్ లోని ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు.. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణినికి వ్యతిరేకంగా నిరసన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.