సత్తా చాటిన వైభవ్ తనేజా..
చీఫ్ ఫైనాన్సియర్ ఆఫీసర్ గా నియామకం..
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. టెక్నాలజీ నుంచి ఫైనాన్స్ వరకు అన్ని సెక్టార్లలో మనవాళ్లు సత్తా చాటుతున్నారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అజయ్ బంగా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో వైభవ్ తనేజా కూడా ఒకరు.
బహుశా టెస్లా పేరు వినని వారు ఉండరు. ప్రపంచ కుబేరుడు, అమెరికన్ పాలిటిక్స్లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఎలాన్ మస్క్ స్థాపించిన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీయే టెస్లా. దీనికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా మన ఇండియన్ వైభవ్ తనేజా వ్యవహరిస్తున్నారు. 2024లో 139 మిలియన్ డాలర్ల ప్యాకేజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.