రాచకొండ సీపీ ఆధ్వర్యంలో తనిఖీ..
స్టేషన్ లో పరిస్థితులపై ఆరా..
తగు సూచనలు చేసిన సీపీ సుధీర్ బాబు..
స్థానికంగా ఉన్న పోలీస్ ఠాణా లను ఉన్నతాధికారులు తరచుగా తనిఖీలు చేస్తుంటారు.. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు.. అవసరమైన సూచనలు చేస్తారు.. ఇది వారి విధినిర్వహణలో భాగమే.. ఈ కోవలోనే బుధవారం రోజు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్.. ఇక సీపీ తో బాటు డీసీపీ ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఎసిపి ఎల్ బి నగర్, కృష్ణయ్యలు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు..