Monday, June 23, 2025
Google search engine
Homeస్పోర్ట్స్ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అర్షదీప్ సింగ్..

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అర్షదీప్ సింగ్..

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది యూఎస్‌, వెస్టిండిస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ అద్భుతంగా రాణించాడు. భారత్‌ జట్టు ప్రపంచకప్‌ గెలువడంలో కీలక పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ ఇటీవల టీ20ల్లో టీమిండియా విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. గతేడాది టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అర్ష్‌దీప్‌ 36 వికెట్ల పడగొట్టాడు. 2024లో ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఐసీసీ బెస్ట్‌ టీ20 ఇంటర్నేషన్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌, జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజాను పక్కన నెట్టి అర్ష్‌దీప్‌ ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments