12 మంది దారుణంగా మృతి చెందారు..
జార్జియా స్కీయింగ్ రిసార్టులో వెలుగుచూసిన ఘటన..
జార్జియా దేశంలోని స్కీయింగ్ రిసార్టులో విషాద ఘటన చోటుచేసుకున్నది. కార్బన్ మోనాక్సైడ్ విషపూరిత వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతిచెందారు. వీరిలో 11 మంది విదేశీయులు, ఓ జార్జియా దేశస్తుడు ఉన్నారు. గుదౌరి ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద ఘటన జరిగింది. నిద్రించే స్థలంలో మృతదేహాలను గుర్తించారు. మాజీ సోవియేట్ ప్రాంతమైన జార్జియాలో ఆ స్కీయింగ్ రిసార్టు ఉన్నది. విద్యుత్తు అంతరాయం ఏర్పడిన సమయంలో.. బిల్డింగ్లో ఉన్న ఆయిల్ పవర్ జనరేటర్ను స్టార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ రెస్టారెంట్ ఉన్న బిల్డింగ్ రెండవ ఫ్లోర్లో మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు.