ఎల్ అండ్ టి సంస్థ, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం..
పనుల పురోగతిపై మీడియాకు వివరాలు అందించిన మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట పండ్ల మార్కెట్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని సోమవారం మధ్యాహ్నం పరిశీలించా రు రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమా అటోగ్రపి శాఖ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి.. అనంతరం సంబంధిత అధికారులు.. నిర్మాణం చేపడుతున్న ఎల్ అండ్ టి సంస్థ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై పాత్రికేయ సమావేశంలో వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, కొత్తకురుమ శివకుమార్, ఎస్వీ కృష్ణ ప్రసాద్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, గణేష్ నాయక్, యూత్ కాంగ్రేస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, నియోజికవర్గ అధ్యక్షులు కె. శివకుమార్ తో పాటు, స్థానిక కాంగ్రేస్ సీనియర్ నేతలు, తదితరులు పాల్గొన్నారు..