తెలంగాణ రాష్ట్ర సదస్సు నిర్వహణ..
అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సదస్సు ఘనంగా నిర్వహించారు.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాలే జగన్నాథం ఆధ్వర్యంలో హైదరాబాద్, కొత్తపేట బాబు జగ్జీవన్ రావ్ భవన్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.. ముఖ్య అతిధులు ఆల్ ఇండియా అఖిలభారత విశ్వకర్మ అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీ ఈటల రాజేందర్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, కార్పొరేటర్లు రాధా ధీరథరెడ్డి, పవన్ కుమార్, అఖిలభారత విశ్వకర్మ జిల్లాల అధ్యక్షులు, రాజకీయ నాయకులు, అఖిల భారత విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మన విశ్వకర్మ బిడ్డ రాష్ట్ర అతిపెద్ద
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ చారి నియమితమైనందుకు వారికి అఖిలభారత విశ్వకర్మ రాష్ట్ర సంఘం వారు సన్మానించుకోవడం జరిగినది.. వైస్ చైర్మన్ భాస్కర్ చారి మాట్లాడుతూ.. ఒక గుడి కట్టాలంటే శిల్పి, పెళ్లి మంగళసూత్రం చేయాలంటే స్వర్ణకార, ఇల్లుకు వడ్రంగి, వ్యవసాయానికి కమ్మరి, వంట పాత్రలు చేసే కంచరి, ఈ సమాజంలో అన్ని కులాలకు ఉపయోగపడే పనిముట్లు అందించే విశ్వకర్మలు అవసరం.. ఈ సమాజ సృష్టికర్తలు పంచదాయలు ఎంతో అవసరం.. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త విశ్వకర్మ బిడ్డ జయశంకర్, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు విశ్వకర్మ బిడ్డ శ్రీకాంత్ ఆచారి.. ఈ సమాజానికి విశ్వకర్మలు ఎన్నో త్యాగాలు చేశారు.. కానీ గ్రామాలలో విశ్వకర్మలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. ఇవన్నీ గ్రహించి విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలను ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాసోజు శంకరమ్మ, గంగాధర్ చారి, కృష్ణ చారి, లీగల్ అడ్వైజర్ భాస్కర్ చారి, మునుగోడు శంకరాచారి, సతీష్ చారి, శ్రీనివాస్ చారి, మహిళా నాయకురాలు జ్యోతి, పట్నాల సావిత్రి, భాగ్యలక్ష్మి, అఖిల భారత విశ్వకర్మ సహోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగినది..