సూచించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
పిల్లలకు ఉచిత పుస్తకాలు, స్కూల్ యూనిఫార్స్ పంపిణీ..
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కుంటూరు రోడ్ లో ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాలలో పిల్లలకు ఉచిత పుస్తకాలను, స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు గనక పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సూచించారు.. అదే విధంగా పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతుల సమస్యలు ఉన్న వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన పాఠశాల సిబ్బందికి తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వనజ, బిజెపి మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, బిజెపి డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు..