ఉత్తర్వుల కోసం కృషిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం, టిజెఎస్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్..
1578 మందికి కారుణ్య నియామకాల కోసం ఆర్డర్ కాపీ ఇచ్చిన జీ.హెచ్.ఎం.సి. కమిషనర్..
శనివారం రోజు జిహెచ్ఎంసి ఖైరతాబాద్ ట్రాన్స్ పోర్ట్ పార్కింగ్ యార్డు నందు ఖైరతాబాద్ ఔట్సోర్సింగ్ కార్మికులందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.. 1578 మంది కార్మికుల కారుణ్య నియామకాలు.. వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు.. గత ఆరు సంవత్సరాలుగా జరగని పని ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ, టీజేఎస్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జీ.హెచ్.ఎం.సి. కమీషనర్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో కమీషనర్ సానుకూలంగా స్పందించి ఈ విషయాలపై మాట్లాడడం జరిగింది.. 1578 మందిని కారుణ్య నియామకాలకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది.. హైడ్రా నుండి జిహెచ్ఎంసికి వచ్చిన వారికి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.. ట్రాన్స్ పోర్ట్ లోని ప్రతి కార్మికునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం, ఆకుల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీజేఎస్ జిహెచ్ఎంసి కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, గడ్డం జగదీష్, ఎండి జహీర్ ఉద్దీన్, కె. బాలరాజ్,
ఏ. అశోక్, బి. ప్రసన్నకుమార్, బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ యాదగిరి, బి. రాజు, మురళీకృష్ణ, శ్రీనివాస్, డ్రైవర్లు, హెల్పర్లు, మెకానిక్స్, మహిళలు, భారీ ఎత్తున కార్మికులు పాల్గొనడం జరిగింది..