బడంగ్ పేట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమం..
కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సి.హెచ్ పారిజాత నర్సింహారెడ్డి..
దంత సమస్యలతో వైద్య శిబిరంలో పాల్గొన్న పలువురు..

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని, బడంగ్ పేట్ లో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జై దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభం కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు.. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, డా.ప్రియాంక రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలువురు దంత సమస్యలున్నవారు ఈ దంత వైద్య శిబిరంలో పాల్గొని చికిత్సలు చేయించుకున్నారు..
