తానే నేరుగా పరిశీలించిన రంగనాథ్..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సందర్శన..
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్న కమిషనర్..
చెరువు తూములు మూసేసి, అలుగు పెంచడంతో చెరువు పైభాగంలో పంటపొలాలు, యిల్లు నీట మునుగుతున్నాయని స్థానికులు ఈ నెల 6 వ తేదీన హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయంజాల్ చెరువు ఎఫ్.టి.ఎల్. పైన వచ్చిన ఫిర్యాదులపై పరిశీలించామని తెలిపారు.. ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తాం. అలాగే ఐఐటి, బిట్స్ పిలాని, జె.ఎన్.టి.యు. విద్యాలయాల ఇంజనీరింగ్ నిపుణులతో కూడా అధ్యయనం చేయిస్తామని తెలిపారు..

ఎన్.ఆర్.ఎస్.సి. ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్ తో పరిశీలించి, రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు ఎఫ్.టి.ఎల్. నిర్ధారిస్తామని అన్నారు.. నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటాంమని కమిషనర్ తెలిపారు.. నగరంలో కొన్ని చెరువులు మాయం అయితే మరికొన్ని చెరువులు ఎఫ్.టి.ఎల్. పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నారు.. చెరువులోకి మురుగు నీరు వచ్చి చేరుతోంది .. ఆ నీరు కిందకు పోవడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.. తాము యింటి స్థలాలు కొన్నప్పుడు ఈ స్థలంలో నీరు నిలవ లేదని తుర్కయాంజాల్ చెరువు పైభాగంలోని ఆదిత్య నగర్ నివాసితులు ఫిర్యాదు చేశారు.. కాగా చెరువుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని శాస్త్రీయ పద్దతిలో ఎఫ్.టి.ఎల్. నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు రంగనాథ్..

ఇక్కడ వున్న నివాసితులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.. గ్రామానికి చెందిన మ్యాప్స్, రెవెన్యూ రికార్డులతో పాటు ఎన్.ఆర్.ఎస్.సి. ఇమేజీలను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సంప్రదించి త్వరలో చెరువు ఎఫ్.టి.ఎల్. నిర్ధారిస్తామని ఆయన
హామీ ఇచ్చారు.. పేదలను హైడ్రా యిబ్బంది పెట్టదు.. హైడ్రా పేరు చెప్పి మిమ్ములను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దు. అని చెప్పారు.. తుర్కయాంజాల్ చెరువు విస్తరణ 495 ఎకరాల్లో వుందని.. మొత్తం విస్తీర్ణం 522 ఏకరాలని ఇలా పలు లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. కాగా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు స్థానిక నివాసితులు.
