Monday, June 23, 2025
Google search engine
Homeహెల్త్ధ‌నియాల‌తో నీళ్ల‌ను తాగండి..

ధ‌నియాల‌తో నీళ్ల‌ను తాగండి..

లెక్కలేని ప్రయోజనాలు కలుగుతాయి..
ఆయుర్వేద ఔషధ గుణాలు ధనియాల సొంతం..

ధ‌నియాల‌ను మ‌నం వంటి ఇంటి మ‌సాలా దినుసులుగా ఎప్ప‌టినుంచో ఉప‌యోగిస్తున్నాం. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఈ దినుసులు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలోనూ ధ‌నియాల‌ను ఉప‌యోగిస్తారు. అలాగే మసాలా వంట‌కాల్లోనూ వీటిని వాడుతారు. అయితే కేవ‌లం రుచి, వాస‌న‌ను అందిండ‌మే కాదు, మ‌న‌కు ఇవి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌ల‌గ‌జేస్తాయి. ధ‌నియాల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ధ‌నియాల‌తో త‌యారు చేసే నీళ్ల‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని వారు చెబుతున్నారు. ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.

ధ‌నియాల నీళ్ల‌ను తాగుతుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ సైతం త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. శ‌రీరం ఇన్సులిన్‌ను బాగా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. వీటిల్లో క్వ‌ర్సెటిన్‌, టెర్పినైన్‌, టోకోఫెరాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. సీజ‌నల్ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారు, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు కూడా ధ‌నియాల నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే శ‌రీరంలోని వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. మోకాళ్లు, కీళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ధ‌నియాల నీళ్ల‌ను తాగితే మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా మారుతారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. ధ‌నియాల నీళ్ల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చు. లేదా భోజనం చేయ‌డానికి 45 నిమిషాల ముందు తాగాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. ధ‌నియాల‌ను రాత్రి పూట నీటిలో నాన‌బెడితే మ‌రుస‌టి రోజు మొత్తం ఆ నీళ్ల‌ను కొద్ది కొద్దిగా కూడా తాగుతూ ఉండ‌వ‌చ్చు.

ఇక ధ‌నియాల నీళ్ల‌ను కేవలం ధ‌నియాల‌ను నాన‌బెట్టి మాత్ర‌మే కాదు, ధ‌నియాల‌ను నీటిలో వేసి మ‌రిగించి కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇలా ఏ ర‌కంగా అయినా స‌రే ధ‌నియాల నీళ్ల‌ను త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ధ‌నియాలు అనేక వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని అంటున్నారు. అల‌ర్జీలు ఉన్న‌వారు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments