Friday, June 20, 2025
Google search engine
Homeక్రైమ్ స్పెషల్నశిస్తున్న మానవత్వపు విలువలు..

నశిస్తున్న మానవత్వపు విలువలు..

కన్నతల్లిని కడతేర్చిన కసాయి..
ఇది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరణ..
తనకు నచ్చిన అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకోలేదని అసంతృప్తి..
దేశ రాజధాని ఢిల్లీలో ఘటన..

నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లి నిరాకరించింది. దీనిపై అసంతృప్తి చెందిన కొడుకు ఆమెను హత్య చేశాడు. దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 22 ఏళ్ల శావన్‌ పోలీసులకు ఫోన్‌ చేశాడు. తన ఇంట్లో దోపిడీ జరిగిందని, తల్లి సులోచన చెవిపోగులు చోరీ చేసిన దొంగలు ఆమెను హత్య చేశారని ఆరోపించాడు.

కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లోని మిగతా వస్తువులు అలాగే ఉండటంతో దోపిడీ జరుగలేదని భావించారు. సులోచన హత్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమె చిన్న కుమారుడు శావన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.

మరోవైపు సులోచన పెద్ద కుమారుడైన 27 ఏళ్ల కపిల్‌కు పెళ్లి సంబంధం కుదిరిందని పోలీసులు తెలిపారు. దీంతో చాలా కాలంగా తెలిసిన అమ్మాయిని తాను కూడా పెళ్లి చేసుకుంటానని శావన్ తల్లితో అన్నట్లు చెప్పారు. దీనికి ఆమె నిరాకరించిందని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వనని తెగేసి చెప్పిందన్నారు.

ఈ నేపథ్యంలో శావన్‌ పథకం ప్రకారం తల్లిని హత్య చేశాడని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ తర్వాత చెవి పోగులు తొలగించి దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడని చెప్పారు. శావన్‌ను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments