రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ వారి సేవా కార్యక్రమం..
వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ
పౌండేషన్ ద్వారా రోగులు, పేదల ఆకలి తీరుస్తూ
అవసరమైన వారికి ఆక్సీజన్ మిషన్లు, బెడ్లు, వీల్ చైర్స్ వెసులుబాటు చేస్తూనారు
ప్రతి ఆదివారం రోజున 300 మంది పేదలకు అన్నదానం చేసే కార్యక్రమమును నిర్వహిస్తున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ వారు ఈ రోజు నీలోఫర్ హాస్పిటల్ వద్ద 300 మందికి పైగా పేదలకు అన్నదానము చేసినారు. ఈరోజు అన్నదానం చేసిన దాతలు శ్రీ డి. గోపి మాధవ రెడ్డి జన్మదినం సందర్బంగా ఎంతో మంది ఆకలి బాధను చూసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు..హోమ్ లోని వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రిల సహకారం తో నెలకోసారి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారు. అలాగే సంస్థ ఆధ్వర్యంలో వృ ద్ధులకు తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోపాటు అవసరమైన వారికి ఆక్సీజన్ కాన్సంట్రే టర్స్, వీల్ చైర్స్, ఐసీయు బెడ్స్, వాకర్స్ ఉచితంగా ఇస్తున్నారు. అవసరం తీరిన తర్వాత వాటిని తిరిగి ఫౌండే షన్కు అప్పగించాల్సి ఉంటుంది. వెసులుబాటు ఉన్న వారు ఫౌండేషన్కు డొనేషన్ ఇవ్వవచ్చు..
నర్సింగ్ కేర్, కేర్ టేకర్, వాటి ద్వారా వచ్చే డబ్బు. దాతల విరాళాలతో ఓల్టేజీ హోం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం హోమ్ లో 26 మంది ఉన్నారు. నెలకు సుమారు రూ. లక్ష యాభై వేల ఖర్చు అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఇల్లు సరి పోవడం లేదు. సేవలను విస్తరించేందుకు దాతల కోసం చూస్తున్నాం. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మందికి తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దాతలు వివరాలకు 8790815527 ఈ నెంబర్లో సంప్రదించవచ్చు
ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి గారు గోపి రెడ్డి గారు శ్రీదేవి గారు విజయ భాస్కర్ గారు ప్రకాష్ బీబీ నాయుడు లక్ష్మణ్ గణేష్ చంద్ర శేఖర్ సైదులు బాలకృష్ణ రాహుల్ లోకో భరత్ తదితరులు పాల్గొన్నారు..


