Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణపరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత..

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత..

సూచించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
ముందస్తు వర్షాకాల శానిటేషన్ స్పెషల్ డ్రైవ్…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకమై నగర్ లో నిర్వహించిన ముందస్తు వర్షకాల శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ లో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటార్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని కాలనీవాసులకు, పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు..

ఈ సందర్బంగా కార్పొరేటార్ మాట్లాడుతూ..

వర్షాకాలంలో హయత్ నగర్ డివిజన్ వాసులందరు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని బహిరంగ ప్రదేశాల్లో వెయ్యకుండా కేవలం స్వచ్ఛ ఆటోలో మాత్రమే వైయాలన సూచించారు..

అదేవిధంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో ఏక్కడ కూడా వర్షపు నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిలువ ఉండడం వలన దోమలు వ్యాపించి అనారోగ్య బారిన పడే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు.

అదేవిధంగా జీ.హెచ్.ఏం.సీ. శానిటేషన్ సిబ్బందితో వారు విధులు సక్రమంగా నిర్వహించడంతోపాటు హయత్ నగర్ డివిజన్ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వరద నీటి కాలువల వద్ద చెత్తాచెదారం చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

అలాగే శానిటేషన్ అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సరిపడా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, సరైన యంత్రంగాలు లేకపోవడంతో నగరంలో చెత్త సమస్య రోజు రోజుకు పెరుగుతుందని శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో శానిటేషన్ డీ.ఈ. నీలిమ, జీ.హెచ్.ఏం.సీ. ఏ.ఈ. హేము నాయక్, ఎస్.ఎస్. చంద్ర శేఖర్, జవాన్ రాజు, కాలనీ అధ్యక్షులు ప్రభూ లింగం , కాలనీ వాసులు ప్రవీణ్ సురేందర్, నాగేశ్వర్ రావు రమణ, ఉమా, శానిటేషన్ సూపర్ వైజర్లు మధు, శ్రవణ్, రాజ్ కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments